News July 21, 2024
విజయవాడ: లక్షకు రూ.10 లక్షలిస్తామని మోసం

లక్ష కడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ పవన్, నాగూర్, అనిత, నాగరాజు అనే నలుగురు మోసం చేశారంటూ, నున్న పోలీసులకు గుంటూరుకు చెందిన సరస్వతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ముఠా డబ్బుతో ఉన్న ఒక గోడౌన్ చూపించి లక్షకు పది లక్షలిస్తామంటే అప్పు చేసి రూ.36 లక్షలు వారికి ఇచ్చానని సరస్వతి పోలీసులకు తెలిపింది. విజయవాడ సుందరయ్యనగర్లోని నాగూర్ ఇంటికి వచ్చి డబ్బు అడగగా స్పందించలేదని బాధితురాలు వాపోయింది.
Similar News
News July 8, 2025
నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.
News July 8, 2025
మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.
News July 7, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన