News March 10, 2025

విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలుకు సత్యవర్ధన్‌ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్‌ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు. 

Similar News

News March 10, 2025

కేటీఆర్ అందుకే కేసుల గురించి భయపడరు: సీఎం రేవంత్

image

KTR అధికారం పోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారని CM రేవంత్ అభిప్రాయపడ్డారు. ‘KTR నా స్టేటస్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? క్రిమినల్స్ కేసులకు భయపడరు. భయం ఉంటే నేరమే చేయరు. KTR కూడా అంతే. అందుకే కేసులకు భయపడను అంటున్నారు. MLC ఎన్నికల్లో BRS పోటీ చేయకుండా తప్పించుకుంది. హరీశ్ రావు లాంటివాళ్లు ఆ ఎన్నికల్లో దొంగ దెబ్బ తీశారు’ అని పేర్కొన్నారు.

News March 10, 2025

Rs 49000 కోట్లు: APతో టాటాపవర్ MOU

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాటా పవర్ సబ్సిడరీ కంపెనీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 7000 MW సామర్థ్యంతో సోలార్, విండ్, హైబ్రీడ్ సహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. పరిస్థితులను బట్టి స్టోరేజ్ సొల్యూషన్స్ నిర్మిస్తుందని తెలిసింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.49000 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. ఎక్కడ నిర్మిస్తారో తెలియాల్సి ఉంది.

News March 10, 2025

సీఐడీ చేతికి ఫాల్కన్ ఇన్వెస్టింగ్ కేసు!

image

తెలంగాణ సీఐడీ చేతికి ఫాల్కన్ కేసు వెళ్లనుంది. ఇప్పటివరకు 19 మంది నిందితుల్లో ముగ్గురు అరెస్ట్ కాగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఫాల్కన్ కేసును సీఐడీ బదిలీకి సైబరాబాద్ పోలీసుల నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో వేల సంఖ్యలో బాధితులున్నారు. సైబరాబాద్ పోలీసులు సీఐడీకి అప్పజెప్పే అవకాశం కనబడుతోంది.

error: Content is protected !!