News August 23, 2024
విజయవాడ: విమానంలో మగబిడ్డకు ప్రసవం

సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న దీప్తి అనే మహిళ విమానంలోనే ప్రసవించి. బుధవారం రాత్రి ఆమె సింగపూర్ నుంచి చెన్నైకి బయలుచేరారు. మార్గమధ్యంలో అర్థరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలు, అక్కడున్న మహిళల సాయంతో క్షేమంగా దీప్తికి ప్రసవం చేశారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. విమానం చెన్నై చేరుకోగానే వైద్యబృందం తల్లి, బిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నారన్నారు.
Similar News
News December 28, 2025
కృష్ణా: గ్యాస్ బావుల తవ్వకానికి 35 చోట్ల అనుమతులు..?

కృష్ణా జిల్లాలోని గూడూరు, పామర్రు, మొవ్వ మండలాల పరిధిలోని 35 ప్రాంతాల్లో వేదాంత సంస్థ చమురు, గ్యాస్ తీసుకునేందుకు పరిశీలిస్తోంది. పంట కాలువలకు దూరంగా ఆయిల్, గ్యాస్ తీసేందుకు బావులు ఏర్పాటు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు సంస్థకు సూచించినట్లు తెలుస్తోంది. ఒక్కో బావిని 3-4 వేల మీటర్ల లోతులో తవ్వి పైపులను వేయనున్నారు, దీనివల్ల వ్యవసాయ భూములకు ఎలాంటి నష్టం వాటిల్లదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
News December 27, 2025
కృష్ణా: జోగి రమేశ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యం తయారీ.!

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన అద్దేపల్లి జనార్ధనరావు, జగన్మోహనరావులను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో శుక్రవారం వీరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.
News December 25, 2025
మచిలిపట్నం: కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.


