News October 22, 2024

విజయవాడ విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా నేడు సోమవారం 48 విమాన సర్వీసులు ప్రయాణించాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 24 సర్వీసుల ద్వారా 2094 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2211 మంది 24 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా విమాన సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామని పేర్కొంది.

Similar News

News December 23, 2025

కృష్ణా: UPHS, PHCలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 23, 2025

దశాబ్దాల భూ సమస్యకు మోక్షం.. కలెక్టర్‌కు సన్మానం

image

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్‌ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 22, 2025

అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలు, దళితవాడల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు.