News March 6, 2026

విజయవాడ: వైభవంగా ప్రారంభమైన కుంభాభిషేకం

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేకం సందర్భంగా శుక్రవారం యాగశాల ప్రవేశంతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశనం, అఖండ దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమై, అగ్నిమధనం ద్వారా నిప్పు వెలిగించి హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేశారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ పాల్గొన్నారు.

Similar News

News April 15, 2026

ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

image

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం

News April 15, 2026

విశాఖను సౌర హబ్‌గా తీర్చిదిద్దుతాం: MP భరత్

image

విశాఖ జిల్లాను సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దుతామని MP భరత్ పేర్కొన్నారు. MVPలోని హెలెన్ కెల్లర్ పాఠశాలలో 5KV సోలార్ ప్రాజెక్టును కలెక్టర్ M.అభిషిక్త్ కిశోర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 15, 2026

పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

image

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.