News January 19, 2025

విజయవాడ: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమిస్తూ శనివారం తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2024 ఎన్నికలలో బాపట్ల జిల్లా వేమూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్.. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ చేతిలో పరాజయం పొందారు. కాగా అశోక్ నియామకంతో పాటు మరో 5 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను వైసీపీ నియమించింది. 

Similar News

News April 23, 2025

కాస్త మెరుగుపడ్డ కృష్ణా జిల్లా స్థానం

image

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణాజిల్లా స్థానం కొంతలో కొంత మెరుగుపడింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 85.32% ఉత్తీర్ణతతో జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా జిల్లా 11వ స్థానానికి పరిమితమవుతూ వచ్చింది. 2022-23లో 74.67%, 2023-24 సంవత్సరంలో 90.05% ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది 20,776 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,726 మంది ఉత్తీర్ణులయ్యారు.

News April 23, 2025

10th RESULTS: 10వ స్థానంలో కృష్ణా జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 85.32%తో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. మొత్తం 20,776 మంది పరీక్షలు రాయగా 17,726 మంది పాసయ్యారు. 10,783 బాలురులో 8,998 మంది, 9,993 మంది బాలికలు పరీక్ష రాయగా 8,728 మంది పాసయ్యారు.

News April 23, 2025

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

image

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.

error: Content is protected !!