News August 23, 2024

విజయవాడ: హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

image

హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. గుణదలలో అరుణ్ కుమార్ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారన్నారు. ఈ ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నమని చెప్పారు. విద్యాధర్, సుంకర చందు, అరుణ్, గణేశ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News October 7, 2024

కృష్ణా: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 7, 2024

8న విజయవాడలో జాబ్ మేళా

image

విజయవాడ పట్టణ పరిధిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీ శిక్షణా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 10 నుంచి పీజీ వరకు చదివి 18-35 సంవత్సరాలలోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి రూ.10 నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందన్నారు.

News October 7, 2024

నేడు దుర్గమ్మ ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

image

దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.