News October 8, 2025

విజయవాడ: RTC పైసా వసూల్..!

image

దసరా సందర్భంగా విజయవాడ PNBSకు SEP 24 నుంచి OCT 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.20.20 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 40 లక్షల మంది పండుగ రోజుల్లో రవాణా చేశారు. PNBS పరిధిలో మొత్తం 750 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక గత ఏడాది కేవలం 20 లక్షల మందే ట్రావెల్ చేయగా.. రూ.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఉచిత బస్సు పథకం వల్ల 50% ప్రయాణికులు సంఖ్య, 25% ఆదాయం పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు.

Similar News

News October 8, 2025

KMR: కలెక్టర్ చొరవ.. బాలికలకు ISRO టూర్

image

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో 10వ తరగతి చదువుతున్న 30 మంది బాలికలను ప్రభుత్వ ఖర్చుతో ISRO టూర్‌కు తీసుకెళ్లనున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. ఈ పర్యటన కోసం బుధవారం స్పేస్ సైన్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్‌కు జిల్లా విద్యార్థులు, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

News October 8, 2025

KMR: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలి: SEC

image

ZPTC, MPTC, MPP ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.

News October 8, 2025

యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్‌ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.