News January 21, 2026
‘విజిబుల్ పోలీసింగ్’ బలోపేతం: ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత కోసం విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు, రహదారి భద్రత నిబంధనల అమలును ముమ్మరం చేయాలని సూచించారు. ఏదైనా భద్రతా పరమైన సమస్యలు తలెత్తితే ప్రజలు వెంటనే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించి పోలీసుల సహకారం తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News February 6, 2026
ఈ నెల 17న కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈ నెల 17న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News February 6, 2026
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు: డీఈవో

విద్యా హక్కు చట్టం ప్రకారం కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించినట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆధార్ వివరాలతో cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఈ ప్రవేశాలు కల్పిస్తారు.
News February 5, 2026
కర్నూలు: CM పర్యటనకు భారీ బందోబస్తు

ఎమ్మిగనూరు(M) కలుగొట్లకు ఈనెల 6న సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో 1,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ముగ్గురు ASPలు, 8 మంది DSPలు, 55 మంది CIలు, 88 మంది SIలు, 297 మంది ASI, HCలు, 485 మంది PCలు, 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, 14 స్పెషల్ పార్టీ బృందాలు, 2 సెక్షన్ల AR పోలీసులు, బాంబ్ స్క్వాడ్, మఫ్టీ బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.


