News April 14, 2025
విజ్జేశ్వరం: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు

సీతంపేట సమీపంలోని విజ్జేశ్వరం – మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్ (15), రాజమండ్రికి చెందిన గంధం హర్ష (20) నదిలో గల్లంతయ్యారని విషయం తెలుసుకొని ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్,ఎస్పీలతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Similar News
News April 16, 2025
RJY: ఇండోర్ పార్లమెంటు సభ్యులతో ఎమ్మెల్యే భేటీ

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉజ్జయిని పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా మహాదేవుని దర్శించుకున్న అనంతరం ఇండోర్ పార్లమెంటు సభ్యుడు శంకర్ లాల్వ ఆహ్వానం మేరకు ఎంపీ నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్, భవాని దంపతులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
News April 15, 2025
కోరుకొండలో రోప్వే.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద నుంచి కొండపై వరకు 0.25 కిలోమీటర్ల మేర రోప్వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రులు ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
News April 15, 2025
డ్రోన్లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.