News January 9, 2026

విడుదలైన కొత్త వంగడాలు.. రైతులకు ఎన్నో లాభాలు

image

నువ్వులు, సజ్జ, పొగాకు, వరిగ పంటల్లో కొత్త వంగడాలను ఆచార్య N.G.రంగా అగ్రికల్చర్ వర్సిటీ అభివృద్ధి చేసింది. వీటిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా జాతీయ స్థాయిలో విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే YLM 146 నువ్వుల వంగడం, ఎక్కువ పోషకాలు గల APHB 126 సజ్జ, PMV 480(అల్లూరి) వరిగ, ABD 132 బీడీ పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

Similar News

News February 20, 2026

బంగ్లాకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

image

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నిరకాల వీసా సర్వీసుల పున:ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ రీఓపెన్ అయ్యింది. త్వరలోనే IND కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాలో హాదీ హత్యతో అల్లర్లు చెలరేగడం, అక్కడి హిందువులపై దాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

News February 20, 2026

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.

News February 20, 2026

TN CM స్టాలిన్‌తో పన్నీరు సెల్వం భేటీ

image

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ CM, AIADMK బహిష్కృత నేత పన్నీరు సెల్వం CM స్టాలిన్‌ను కలిశారు. ఐదేళ్ల DMK పాలనను కొనియాడారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో DMK మరోసారి విజయం సాధిస్తుందన్నారు. CMను కలిసి ఐదేళ్ల పాలన బాగుందని చెప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీతో పన్నీరుసెల్వం వర్గం DMKతో ఎన్నికలకు వెళ్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.