News June 20, 2024
విద్యతోనే గిరిజనుల అభివృద్ధి: ఎస్టీ కమిషన్ సభ్యుడు
విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.
Similar News
News October 4, 2024
బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్
దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం బన్నీ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.
News October 4, 2024
Way2News వార్తకు స్పందించిన పోలీసులు.. బాలుడు లభ్యం
గోనెగండ్ల పరిధిలోని చిన్నమరివీడుకు చెందిన వర్ధన్ నాయుడు భారతీ దంపతుల కుమారుడు సూర్యతేజ(14) నిన్నటి రోజు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని తల్లి భారతి రోధించిన తీరును Way2News ప్రచురించింది. సీఐ గంగాధర్ స్పందించి ఏఎస్ఐ తిమ్మారెడ్డిని ఆదేశించడంతో.. బాలుని ఆచూకీ కోసం కర్నూలులో గాలించారు. పాత బస్టాండ్లో ఆచూకీ లభించింది. దీంతో Way2Newsకు, పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
News October 4, 2024
ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు సహా 24 మందిపై కేసు
కర్నూలు జిల్లాలోని రెన్యూ విండ్ పవర్, గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో పోలీసులు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినె విరూపాక్షి తమ్ముడు, వైసీపీ నేత బసినె వెంకటేశ్తో పాటు మరో 23 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. వారికి సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు.