News March 14, 2025

విద్యార్థులకు అర్థమయ్యేలా ఏఐతో బోధించండి: కలెక్టర్

image

విద్యార్థులకు అర్థమయ్యేలా AIతో బోధించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తొలి విడతగా 33 పాఠశాలల్లో ఏఐని అమలు చేస్తున్నట్లు చెప్పారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏఐతో బోధన చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాదిరి పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in

News November 9, 2025

అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

image

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.

News November 9, 2025

GWL: టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే..!

image

తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లు అమర్చేందుకు డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాది రబీ లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ విషయమై ఇటీవల కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గతేడాది డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోగా స్టాప్ లాక్ గేట్ అమర్చారు. ఇంజినీరింగ్ నిపుణుల ఆదేశం మేరకు 33 కొత్త గేట్లు అమర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.