News February 3, 2025
విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించిన పోలీసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో రంగంపేట్లోని ఓ అకాడమీ విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, ఉమెన్ ట్రాఫికింగ్, వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలపై షీ టీం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Similar News
News February 24, 2026
కల్తీ పాలు తాగిన బాలుడు కేజీహెచ్లో మృతి

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ.. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్లో జాయిన్ చేశారన్నారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.
News February 24, 2026
ములుగు: ఇంటర్ ఎగ్జామ్స్.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే

ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8:30కే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. హాల్ టికెట్ తప్ప ఇతర వస్తువులకు అనుమతి లేదన్నారు. దూర ప్రాంతాల విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. సందేహాల కోసం జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు 9390959967, 6281556365 విడుదల చేశారు.
News February 24, 2026
హన్మకొండ జిల్లాలో 38 మంది డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు

హన్మకొండ జిల్లాలో జనవరిలో నిర్వహించిన రోడ్డు భద్రతావారోత్సవాల్లో భాగంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారితో పాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన 38 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు హన్మకొండ ఆర్టీఓ అధికారులు మంగళవారం తెలిపారు. అధిక లోడ్తో వెళ్తున్న ఓ వాహన డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.


