News July 10, 2025
విద్యార్థులతో నంద్యాల కలెక్టర్

వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మెగా పీటీఎం’లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్ వద్ద విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News July 11, 2025
NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్కు తరలించారు.
News July 11, 2025
KMR: క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

TG రాష్ట్ర క్రీడా అకాడమీల్లో ఈ ఏడాది ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్ (గచ్చిబౌలిలో బాలురు, బాలికలకు), హ్యాండ్బాల్, ఫుట్బాల్ అకాడమీలు (LB స్టేడియంలో బాలురకు మాత్రమే) ఈ ఎంపికలు జూలై 15, 16 తేదీల్లో ఉంటాయన్నారు.12 నుంచి 16 వయస్సు గల అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News July 11, 2025
సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు: కవిత

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని MLC కవిత మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇందుకోసం ఈనెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నామ చెప్పారు. సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదన్నారు.