News October 16, 2025

విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం: భద్రాద్రి కలెక్టర్

image

జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాలుర)ను సందర్శించిన ఆయన, పాఠశాల విద్యా కార్యక్రమాలు, వసతుల పరిస్థితి, విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఖాళీగా ఉన్న భూమిని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News October 17, 2025

VKB: ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు 18న చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు కొత్తగడిలోని బాలికల పాఠశాలలో ఇవ్వాలన్నారు. దరఖాస్తులతో పాటు కులం, ఆదాయం, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు సమర్పించాలన్నారు.

News October 17, 2025

KMR: 49 షాపులకు 419 దరఖాస్తులు

image

మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియకు కామారెడ్డి జిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. గురువారం వరకు జిల్లాలోని మొత్తం 49 వైన్ షాపులకు 419 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు పేర్కొన్నారు.
కామారెడ్డి: 15 షాపులకు 104 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 84 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 79 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 77 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 75 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News October 17, 2025

NZB: ఫ్యాక్టరీలో గుట్కా తయారీ, ఇద్దరి అరెస్ట్

image

NZB శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను CCS పోలీసులు పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం సోదాలు చేసి అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నారు.