News January 9, 2026
విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు: భట్టి విక్రమార్క

TG: విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని డిస్కంలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దీంతో పంపిణీ సంస్థలు తమ ఆర్థిక లోటును ప్రభుత్వం ద్వారా పూడ్చుకునేలా ARR నివేదికలను సవరించాయి. TGSPDCL ₹9,583Cr, TGNPDCL ₹12,521Cr లోటులో ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ నెల 31 వరకు డిస్కంల నివేదికలపై అభ్యంతరాల స్వీకరణ, మార్చి 5, 7 తేదీల్లో ERC ఆఫీసుల్లో బహిరంగ విచారణ జరిపి టారిఫ్ ఆర్డర్ను జారీ చేయనున్నారు.
Similar News
News February 17, 2026
AI వల్ల ఉద్యోగాలు పోవు.. స్కిల్స్ పెంచుకోవడమే మార్గం: మోదీ

AI వల్ల ఉద్యోగాలు పోవని, మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడమే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత మనుషులను తొలగించబోదని, సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్తరకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అందుకే ప్రభుత్వం రీ-స్కిల్లింగ్పై భారీగా పెట్టుబడి పెడుతోందని చెప్పారు. గ్లోబల్ AI ఇండెక్స్లో భారత్ మూడో స్థానంలో ఉండటం మన సత్తాకు నిదర్శనమన్నారు.
News February 17, 2026
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్లో 2000 ఫోటోల వరకు అప్లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.
News February 17, 2026
ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్కు మోదీ ఆహ్వానం

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.


