News September 6, 2025
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ఆగిన గణపయ్య రథం..!

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కరీంనగర్లో కొలువైన 35 అడుగుల భారీ గణేష్ శోభాయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ విద్యుత్ తీగలు తొలగించకపోవడంతో శోభాయాత్ర ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారుల కోసం “మిత్రా యూత్” నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి శోభాయాత్ర సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 6, 2025
KNR: యూరియా లేక అన్నదాతల ఆందోళన

జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న యూరియా కోసం ఎదురుచూపులు తప్పటం లేదని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాది రైతులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడే దుస్థితి నెలకొందని వాపోయారు. ప్రస్తుతం పంటలకు యూరియా వేసే సమయం కావటంతో ఇబ్బందులు పడుతున్నామని.. పరిస్థతి ఇలానే ఉంటే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతున్న కోరుతున్నాడు.
News September 6, 2025
KNR: నిమజ్జనం పూర్తయ్యేదాకా అప్రమత్తత అవసరం

మనకొండూరులో జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, సి.పి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి సందర్శించి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రజల రద్దీ నియంత్రణపై కలెక్టర్ తగు సూచనలు చేశారు. నిమజ్జనం పూర్తయ్యేవరకు అధికారులు అప్రమత్తతో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
News September 6, 2025
కరీంనగర్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా.కాంపల్లి అర్జున్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ మేరకు KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో వాణిజ్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న డా.కాంపల్లి అర్జున్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయుడి కృషికి రాష్ట్రం ఇచ్చిన గౌరవమన్నారు.