News August 25, 2025
విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు: ADB DSP

మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ మండలం అంకోలిలో ఆయన ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టవద్దని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News August 24, 2025
ఆదిలాబాద్: ‘ఉద్యోగులకు శాపంగా సీపీఎస్’

ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారిన సీపీఎస్ రద్దు పరిచి ఓపీఎస్ అమలు చేయించడమే పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నూర్ సింగ్, నవీన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగిన విరమణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్నారు.
News August 24, 2025
తాంసిలో వైభవంగా ఎద్దుల జాతర.. హాజరైన కలెక్టర్, ఎస్పీ

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
News August 23, 2025
ఆదిలాబాద్: డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చందుకు స్పెషల్ డ్రైవ్స్

ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు కాలనీలు, దుకాణాల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రోమా సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేసేవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.