News June 29, 2024
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: ఆర్జేడీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719586643076-normal-WIFI.webp)
ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ విజయ భాస్కర్ అన్నారు. పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడి బయట పిల్లలు బడికి వచ్చే చర్యలు చేపట్టాలని అందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమయపాలన ఎంఈఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Similar News
News July 1, 2024
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్న మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719752017738-normal-WIFI.webp)
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గోనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సాలూరు పట్టణంలోని 21వ వార్డులోని గొల్లవీధి సచివాలయం, 10:30కు కందులపథం, మధ్యాహ్నం 12 గంటలకు మక్కువ మండలం కవిరిపల్లి, 3 గంటలకు పాచిపెంట మండలం మంచాడవలస, సాయంత్రం 4:30కు మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేట సచివాలయంలో హాజరుకానున్నారు.
News June 30, 2024
విజయనగరం: రబ్బర్ డ్యాం దిగువన వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719754107028-normal-WIFI.webp)
కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం దిగువున స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. కొమరాడ ఎస్ఐ నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం గరుడబిల్లికి చెందిన కలియ దాసు(60) బూర్జివలస స్టోన్ క్రషర్లో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పని ముగించుకుని స్నానానికి నదికి వెళ్ళిన దాసు మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆదివారం గుర్తించి.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
News June 30, 2024
మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719747140683-normal-WIFI.webp)
గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఆదివారం వినతి పత్రం అందజేశారు. జీవోనం-3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి.సం.శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.