News May 18, 2024
‘విధి నిర్వహణలో భాగంగా కూతురి పెళ్లికి వెళ్ళలేదు’

పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన మలికా గర్గ్ తండ్రి సత్యేంద్ర గర్గ్ గతంలో అండమాన్ నికోబార్ దీవుల డీజీపీగా, తూర్పు ఉత్తర ప్రాంతానికి జాయింట్ సెక్రటరీగా పని చేశారు. అయితే ఆయన విధుల నిర్వహణలో భాగంగా కూతురు వివాహానికి కూడా హాజరు కాలేకపోయారు. అలాగే మలికా గర్గ్కు 2023లో స్కోచ్ అవార్డు లభించింది. ఎవరైనా విధుల్లో తప్పు చేస్తే ఆమె ఉపేక్షించరనే పేరు కూడా ఉంది.
Similar News
News April 23, 2025
గుంటూరులో రికవరీ ఏజెంట్ ఆత్మహత్య

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
News April 23, 2025
గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
News April 23, 2025
24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.