News July 24, 2024
విధుల్లో అలసత్వం.. డ్రెయిన్ల శాఖ ఈఈ సస్పెండ్

భారీ వర్షాలు.. వరదల వేళ విధుల్లో అలసత్వం వహించి గోస్తని డ్రెయిన్కు గండి పడటానికి కారణమైన డ్రెయిన్ల శాఖ ఈఈ MVV కిషోర్ను ప.గో కలెక్టర్ సి.నాగరాణి మంగళవారం సస్పెండ్ చేశారు. పాలకోడెరు మండలం మోగల్లు వద్ద గోస్తని డ్రెయిన్కు గండి పడటానికి ఈఈ పర్యవేక్షణ లోపం, సరైన ముందస్తు చర్యలు లేకుండా బాధ్యతా రాహిత్యంతో ఉండటమే కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 18, 2026
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 18, 2026
పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. జిల్లాలోని 132 కేంద్రాలలో 24,166 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
News February 18, 2026
పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. జిల్లాలోని 132 కేంద్రాలలో 24,166 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


