News June 26, 2024
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. రేగోడ్ ఎమ్మార్వో, కస్తూర్బా పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నిన్న తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. వచ్చే నెలలో అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. PM విశ్వకర్మ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.
Similar News
News June 29, 2024
సంగారెడ్డి: నేడు తార డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT
News June 29, 2024
SRD: ప్రభుత్వ పాఠశాలల ఆడిట్ షెడ్యూల్ విడుదల
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నిధులపైన జూలై 20 నుంచి 22 వరకు ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడిట్లకు సంబంధించిన అన్ని రకాల యూసీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
News June 29, 2024
సంగారెడ్డి: ‘మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి పాల్గొన్నారు.