News April 7, 2025

వినతులు స్వీకరించనున్న మంత్రి కొండపల్లి

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాకు చెందిన ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను విడతల వారీగా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News April 7, 2025

ఫోర్బ్స్ జాబితాలో GMR

image

ఫోర్బ్స్ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో రాజాంకు చెందిన గ్రంథి మల్లిఖార్జునరావు 1,219 స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో సంపన్న వ్యక్తి ఆయనే. ఏప్రిల్ 2 నాటికి ఆయన నికర సంపద 3.0 బిలియన్ డాలర్లు కాగా.. తన స్వగ్రామమైన రాజాంలో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. రాజాంలో విద్యాసంస్థలు, ఆసుపత్రి నిర్మించారు. ఎయిర్ పోర్టును GMR సంస్థనే నిర్మిస్తుంది.

News April 6, 2025

రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

image

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామ‌తీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

News April 5, 2025

VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

image

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.

error: Content is protected !!