News February 18, 2025

వినుకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

వినుకొండలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News February 11, 2026

వరంగల్ జిల్లాలో 85.42శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్ధన్నపేట, నర్సంపేట పట్టణాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.42శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో 51,494 ఓట్లకు గాను 43,985 మంది ఓటు వేశారు. ఇందులో వర్ధన్నపేటలో 86.23శాతం, నర్సంపేటలో 85.21శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా జిల్లాలో 84.93శాతం పురుషులు, 85.87శాతం మహిళలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News February 11, 2026

జమ్మికుంట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ప్రకారం.. ధర్మారంకు చెందిన మారపల్లి <<19106431>>ఐలయ్య<<>> (59) మంగళవారం రాత్రి బస్టాండ్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా JMKT నుంచి వావిలాల వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం HNK తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు కుమారుడు అజయ్ పిర్యాదు చేసినట్లు తెలిపారు.

News February 11, 2026

సిరిసిల్ల జిల్లాలో మున్సిపాలిటీల పోలింగ్ శాతం వివరాలు

image

సిరిసిల్ల మున్సిపాలిటీలో సాయంత్రం ఐదు గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 39 వార్డులలో 81,959 మంది ఓటర్లకు గాను 63,562 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటల వరకు 77.99 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లకు గాను 31,881 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.