News March 27, 2025

వినుకొండ: 24 మంది రెవెన్యూ సిబ్బందికి షోకాజ్ నోటీసులు  

image

వినుకొండ మండలంలో విధులు నిర్వహిస్తున్న 24 మంది గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్‌లకు తహశీల్దార్ సురేశ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని, లేని పక్షంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో రెవెన్యూ సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని తహశీల్దార్ తెలిపారు. 

Similar News

News December 14, 2025

NZB: 11 గంటల వరకు 49.13 శాతం పోలింగ్

image

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన నాలుగు గంటల్లో ఉదయం 11 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 49.13 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ధర్పల్లి మండలంలో 53.59%,
* డిచ్‌నపల్లి-35.36%
* ఇందల్వాయి-50.45%
* జక్రాన్‌పల్లి-55.16%
* మాక్లూర్-56.25%
* మోపాల్- 55.17%
* NZB రూరల్-60.28%
* సిరికొండ-38.49% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News December 14, 2025

వికారాబాద్: 11AM UPDATE.. 52.35% ఓటింగ్

image

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 మండలాల్లో 20.67% ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 43,385 మంది ఓటేశారు. బంట్వారం 44.75, ధారూర్, 56.34, కోట్‌పల్లి 56.41, మర్పల్లి 47.63, మోమిన్‌పేట 52.72, నవాబ్‌పేట 47.84, వికారాబాద్ 64.15% ఓటింగ్ నమోదైంది.

News December 14, 2025

జనగామ: 51.10% పోలింగ్ @11AM

image

జనగామ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమయ్యాయు. 11 గంటల వరకు నాలుగు మండలాల్లో కలిపి 51.10 శాతం పోలింగ్ నమోదయింది. బచ్చన్నపేటలో 45.77 శాతం, జనగామలో 49.28 శాతం, తరిగొప్పులలో 56.77 శాతం, నర్మెట్టలో 60.02 శాతం నమోదయింది. నియోజకవర్గంలో అత్యధికంగా నర్మెట్ట మండలంలో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదయింది.