News February 27, 2026
విపక్షాలే టార్గెట్గా సీబీ‘ఐ’.. ఆరోపణలకు బలం చేకూరిందా?

విపక్షాలను టార్గెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం CBI, EDలను వాడుకుంటోందనేది ఎంతో మంది ఆరోపణ. అక్రమ కేసుల్లో ఇరికించి నాయకుల క్రెడిబిలిటీని నాశనం చేయడం, జైలుకు పంపడమే లక్ష్యమన్న విమర్శలున్నాయి. ఈ వాదనలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పుతో బలం చేకూరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాల్లేకుండానే కేసు నమోదు చేసినందుకు CBI అధికారులపైనే విచారణ చేయాలని కోర్టు చెప్పడమే నిదర్శనమంటున్నారు.
Similar News
News March 4, 2026
రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
News March 4, 2026
ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు: ట్రంప్

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక గతంలో కంటే కూడా తగ్గుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఇరాన్పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదన్నారు. కాగా ఇరాన్పై దాడుల్లో సహకరించని స్పెయిన్తో ట్రేడ్ రద్దు చేసుకుంటామన్న ట్రంప్ యూకేపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 4, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 4)

* 1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
* 1973: తెలుగు సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
* 1964: తెలుగు, కన్నడ కవి కిరికెర రెడ్డి భీమరావు మరణం
* 2002: ఒడిశా, బెంగాల్, త్రిపుర మాజీ గవర్నర్ కె.వి.రఘనాథరెడ్డి మరణం (ఫొటోలో కుడివైపు)
* 2016: లోక్సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా మరణం
* జాతీయ భద్రతా దినోత్సవం
* ప్రపంచ ఊబకాయ దినోత్సవం


