News September 14, 2025
విమానాశ్రయం ద్వారా ఎంతమంది ప్రయాణించారంటే.?

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా శనివారం 44 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 22 సర్వీసుల ద్వారా 1,566 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,880 మంది 22 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
Similar News
News September 14, 2025
కృష్ణాపురం నవోదయలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దాష్టీకం

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్లో లాక్ చేసిన ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్ని హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు.
News September 14, 2025
కరీంనగర్: బీరు ప్రేమికులకు గుడ్ న్యూస్

బీరు ప్రేమికులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు HYD లోనే పరిమితమైన మైక్రో బ్రూవరీలు ఇప్పుడు కరీంనగర్, రామగుండం వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా ఏర్పాటు చేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ నగరాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు SEP 25న సా.5 గం.లోపు KNR ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
News September 14, 2025
సంగారెడ్డి: సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.50 కోట్లు రికవరీ

జాతీయ లోక్ అదాలత్లో భాగంగా సైబర్ క్రైమ్ కేసుల కింద రూ.1.50 కోట్లు రికవరీ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందవచ్చని అన్నారు. సైబర్ బాధితులకు న్యాయం అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.