News June 6, 2024
వివాదాస్పద పోస్టులు పెడితే ఊరుకోం: ఎస్పీ శ్రీధర్
సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన వరసల ముత్యాలరావు సోషల్ మీడియాలో కులాలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ మెసేజ్ పెట్టాడని, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ విధమైన నేరాలకు ఎవరు పాల్పడినా కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News September 29, 2024
మార్కెట్లో షాక్ ఇస్తున్న ‘కొత్తిమీర’ ధరలు
ఏ కూరైనా సరే ఘుమఘుమలాడాలంటే చివరలో కాస్తంత ‘కొత్తిమీర’ పడాల్సిందే. అయితే.. ప్రస్తుత ధర చూసి సామాన్యులు కొత్తమీర కట్ట కొనాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో కొన్ని చోట్ల ఒక్కో కట్ట ధర రూ.50 ఉండగా.. కిలో రూ.300పైనే ఉంది. ఇదొక్కటే కాదు ఆకుకూరల రేట్లన్నీ అదే రేంజ్లో ఉన్నాయి. ఇటీవలి వర్షాల దెబ్బకు ఆకుకూరల పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గి రేట్లు భగ్గుమంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
News September 29, 2024
కోనసీమ: ప్రముఖ రచయిత్రి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి శనివారం కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20పైగా పుస్తకాలు రాసి ఎన్నో పురస్కారాలు పొందారు. ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం TG నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. విజయభారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్కి ఆదివారం అందజేయనున్నారు.
News September 29, 2024
TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?
TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.