News February 21, 2025

వివిధ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఓయూలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహబిలిటేషన్ సైకాలజీ కోర్సుల మొదటి సెమిస్టర్, పీఎస్వై క్లినికల్ సైకాలజీ మొదటి సంవత్సరం, ప్రొఫెషనల్ డిప్లమా ఇన్ క్లినికల్ సైకాలజీ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ. 200 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.

Similar News

News February 22, 2025

ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

image

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.

News February 22, 2025

కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

image

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

News February 22, 2025

HYD: బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు: అద్దంకి

image

బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించి దేశంలో ఇంత పెద్ద ఎత్తున విప్లవం వస్తున్న క్రమంలో.. ఎందుకు బీజేపీ బీసీలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే రాహుల్ గాంధీ జీవిత లక్ష్యమని వివరించారు.

error: Content is protected !!