News April 12, 2024

విశాఖపట్నం-బెనారస్ రైళ్ల మార్గం మళ్లింపు

image

విశాఖపట్నం- బెనారస్ రైళ్ల మార్గం మళ్లింపు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
ఈ నెల 21న విశాఖపట్నం నుంచి బయలుదేరే (18311) విశాఖపట్నం-బెనారస్ ఎక్స్ ప్రెస్, ఈ నెల 22న బెనారస్ నుంచి బయలుదేరే (18312) బెనారస్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయనగరం- ఖుర్దా రోడ్- అంగుల్-సంబల్పూర్ సిటీ-జార్సుగూడ మీదుగా మళ్లించిన మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపారు.

Similar News

News October 6, 2025

విశాఖ: ఏ జోన్‌లో ఎంతమంది వర్తకులున్నారంటే?

image

ఇటీవల యూసీడీ (UCD) విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీలోని వీధి వర్తకుల సర్వే పూర్తయింది. ఎనిమిది జోన్‌ల పరిధిలో 18,041 మంది వ్యాపారులను గుర్తించారు. జోన్‌-1 పరిధిలో 217 మంది, జోన్‌-2లో 2,965, జోన్‌-3లో 3,615, జోన్‌-4లో 2,879, జోన్‌-5లో 3,510, జోన్‌-6లో 2,152, జోన్‌-7లో 154, జోన్‌-8లో 2,549 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. <<17922542>>వెండింగ్‌ జోన్ల<<>>ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

News October 6, 2025

5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

image

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.

News October 5, 2025

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

image

విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి జలరవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనావాల్ ఆదివారం రాత్రి చేరుకున్నారు. సోమవారం విశాఖ పోర్టులో భారీ క్యారియర్ నౌక చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి స్వాగతం పలకనున్నారు. సాగర్‌మాల ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ ఇతర అధికారులు ఉన్నారు.