News December 23, 2025

విశాఖలో అట్టహాసంగా ‘పీసా’ మహోత్సవం

image

విశాఖ పోర్ట్ స్టేడియంలో రెండు రోజుల పీసా (PESA) మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, కమిషనర్ కృష్ణతేజ, క్రీడాకారిణి జ్యోతి సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు 68 స్టాళ్లతో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఖేలో ఇండియా కబడ్డీలో మధ్యప్రదేశ్ (పురుషులు), జార్ఖండ్ (మహిళలు) విజేతలుగా నిలవగా, ఆర్చరీలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.

Similar News

News December 30, 2025

సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-తిరుపతి, విశాఖ-బెంగళూరు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ వంటి 9 జతల రైళ్లకు జనవరి 1 నుండి వివిధ తేదీల్లో అదనపు ఏసీ, స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు 3rd AC కోచ్‌ను కూడా చేర్చారు.

News December 30, 2025

ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

image

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.

News December 30, 2025

REWIND: సైబర్ క్రైమ్‌లో 205 మంది అరెస్ట్.. విశాఖ సీపీ

image

విశాఖలో 2025లో సైబర్ క్రైమ్ సంబంధించి 205 మందిని అరెస్టు చేశామని సీపీ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. వీరి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని వివరించారు. వార్షిక సమావేశం ముగింపులో ఆయన మాట్లాడారు. విశాఖలో నేర, శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.