News June 28, 2024
విశాఖలో ఆటో డ్రైవర్పై దాడి

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కవానిపాలెం ప్రభుత్వ వైన్ షాప్ వద్ద ఆటో డ్రైవర్ బొల్లి అక్కునాయుడుపై దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయాలైన ఆటో డ్రైవర్ను కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎంవీపీ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 4, 2025
విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేశారు.
News November 4, 2025
విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News November 4, 2025
ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.


