News October 16, 2025

విశాఖలో ఆ కార్పొరేటర్ అంటేనే భయపడుతున్నారు!

image

జీవీఎంసీలో ఓ కార్పొరేటర్ వ్యవహారం బ్లాక్ మెయిల్ తరహాలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై ప్రెస్‌మీట్‌లు పెట్టి ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులను బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లు గడించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ హయాంలోనూ నాయకులపై విరుచుకుపడ్డ ఆయన.. ఇప్పుడు కూటమి నాయకులపైనా ఆరోపణలు చేసేస్తున్నారట. దీంతో ఆయనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేతలు కామ్‌గా ఉంటున్నారని సమాచారం.

Similar News

News October 16, 2025

క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

image

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.

News October 16, 2025

గుజరాత్ మంత్రులంతా రాజీనామా

image

గుజరాత్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.

News October 16, 2025

23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ: కలెక్టర్

image

విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈనెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 కేంద్రాలు పని చేయడంతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.