News March 1, 2025
విశాఖలో ఇంటర్ పరీక్షలు.. 95% హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు శనివారం విశాఖ జిల్లాలో 95% మంది హాజరయ్యారని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి సుధీర్ తెలిపారు. జనరల్ పరీక్షలకు 41,945 మందికి 40,000 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,741 మందికి 1,635 మంది హాజరయ్యారు. అన్ని కోర్సులకు సంబంధించి 43,686 మందికి 41,634 మంది విద్యార్థులు హాజరు కాగా 2,052 గైర్హాజరు అయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Similar News
News March 1, 2025
విశాఖ : ఒక్క నిమిషం .. వారి కోసం..!

విశాఖ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
News March 1, 2025
రోడ్డుప్రమాదంలో విశాఖ వాసి మృతి

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందాడు. విశాఖ న్యూ పోర్టు కాలనీకి చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ వైపు వెళుతుండగా డుంబ్రిగుడ మండలం నారింజవలస వద్ద స్కూటీ డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమనాథ్ మృతిచెందాడు. రామ్మోహన్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News March 1, 2025
విశాఖలో TODAY TOP NEWS

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్ప్రెస్లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది