News September 21, 2025
విశాఖలో ఈ-గవర్నెన్స్ సదస్సుకు సీఎం

సీఎం చంద్రబాబు సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు విశాఖ చేరుకుంటారు. 9:45కు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొంటారు. సదస్సుకు ముందు ఈ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటలకు విజయవాడ తిరిగి వెళ్తారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ గవర్నెన్స్ సదస్సులో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
Similar News
News September 21, 2025
ఈ ఏడాది నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే?

ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.
News September 21, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఉండటంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అందుకే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు.
News September 21, 2025
NRPT: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
పరిపాలనకు సంబంధించి జిల్లా అధికారులతో సోమవారం ఉదయం 11.30 గంటలకు సమీక్షా సమావేశం ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్కు రావొద్దని చెప్పారు.