News December 12, 2025
విశాఖలో ఐటీ పెట్టుబడులతో కొలువుల జాతర(1/2)

విశాఖ కాపులప్పాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,583 కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుండగా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇటు మధురవాడ హిల్-4లో నిర్మించనున్న సత్వా వాంటేజ్ క్యాంపస్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40-50 వేల మందికి ఉపాధి లభించనుంది.
Similar News
News December 12, 2025
ఏలూరు మీదుగా రైళ్ల పెంపు

ఏలూరు జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను పెంచుతూ ద.మ రైల్వే ఉత్తర్వులు ఇచ్చింది. సికింద్రాబాద్ – అనకాపల్లి( 07059) ఈనెల 29 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 వరకూ నడుస్తుంది. అనకాపల్లి – సికింద్రాబాద్ (07060) ఈ నెల 30 – ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. (07035) చర్లపల్లి- అనకాపల్లి JAN 17- FEB 14 వరకు నడుస్తుంది. అనకాపల్లి – చర్లపల్లి (07036) JAN 18- FEB 15 వరకూ పొడిగించారు.
News December 12, 2025
భూపాలపల్లి: ఉప సర్పంచ్ ఎన్నికలు వాయిదా!

జిల్లా మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్లపల్లి మండలాల్లోని పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. గణపురం మండలంలో 16 పంచాయతీలకు ఆరు, కొత్తపల్లి గోరి మండలంలో 13 పంచాయతీలకు ఒకటి, మొగుళ్లపల్లి మండలంలో 24 పంచాయతీలకు 4, రేగొండ మండలంలో 20 పంచాయతీలకు ఒక చోట ఉపసర్పంచ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
News December 12, 2025
రాష్ట్రంలో మా ప్రభంజనం మొదలైంది: BRS

TG: తొలి దశ పంచాయతీ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘గులాబీ జెండా పల్లెల్లో దుమ్మురేపింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవలేకపోయింది. అధికార పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. గత సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలో మా పార్టీ 64% సీట్లు గెలిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ 44% సీట్లే గెలిచింది’ అని పేర్కొంది.


