News August 17, 2025

విశాఖలో ఒ’క్కో’ చోట ఒ’క్కో’లా నాన్ వెజ్ ధరలు

image

విశాఖలో నాన్ వెజ్ ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. అక్కయ్యపాలెంలో కేజీ మటన్ రూ.900-1000 మధ్య ఉండగా.. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్ రూ.230గా ఉంది. తాటిచెట్లపాలెంలో కేజీ మటన్ కొన్ని షాపుల్లో రూ.900 ఉండగా.. మరికొన్ని షాపుల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230, స్కిన్‌ రూ.220గా ఉంది. డజన్ గుడ్లు ధర రూ.66గా ఉంది.

Similar News

News August 17, 2025

విశాఖ జిల్లాలో 358 మి.మీ వర్షపాతం నమోదు

image

గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలో 358.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మహారాణిపేట మండల పరిధిలో 66.6 మి.మీ, అత్యల్పంగా ములగాడలో 14.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. సీతమ్మధారలో 49.8 మి.మీ, పద్మనాభం-46.8 మి.మీ, పెందుర్తి-43.4 మీ.మీ, భీముని పట్నం-40.6 మి.మీ, ఆనందపురం-21.2మి.మీ, పెదగంట్యాడ-20 మి.మీ, గోపాలపట్నం-19.4 మి.మీ, విశాఖ రూరల్ 19.2 మి.మీ, గాజువాక మండల పరిధిలో 14.6 మి.మీ వర్షపాతం నమోదయింది.

News August 17, 2025

ఓటు గల్లంతుపై నిరసనలు చేస్తాం: కాంగ్రెస్

image

ఓట్ గల్లంతుపై రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో నిరసనలు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. నగర కాంగ్రెస్ నేతలతో కలిసి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుతంత్రాలు పాల్పడుతోందని ఆరోపించారు. సెప్టెంబర్1న పాట్నాలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

News August 16, 2025

విశాఖలో బంగారం చోరీ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో శనివారం చోరీ జరిగింది. సెక్టార్ 6, 105/bలో నివాసం ఉంటున్న డీజీఎం నల్లి సుందరం తన భార్యతో కలిసి బయటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. ఇంట్లో 24 తులాల బంగారం చోరీకి గురికాగా మరో 40 తులాల బంగారం బిరువాలోనే ఉన్నట్లు తెలిపారు.