News May 20, 2024

విశాఖలో కొండెక్కిన చికెన్ ధర

image

వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.

Similar News

News December 26, 2025

విశాఖలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకం

image

విశాఖలో రూ.1,425 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. GVMC ఆధ్వర్యంలో నగరంలోని మధురవాడ, ఆర్ఆర్ సెంటర్, గాజువాక, కూర్మన్నపాలెం, దువ్వాడ ఫ్లైఓవర్ కింద, సూర్యబాగ్ సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో తొలి దశలో 250 వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, నగర సుందరీకరణ, వీధి వ్యాపారుల జీవనోపాధి భద్రతే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

News December 26, 2025

విశాఖ: నకిలీ డాక్టర్‌గా చలామణీ అవుతున్న కేటుగాడి అరెస్ట్ (1/2)

image

నకిలీ వైద్యుడి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదివి కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు, గతంలో 33 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇతడి నుంచి రూ. 30 వేల నగదు, స్టెతస్కోప్, వైట్ అప్రాన్ స్వాధీనం చేసుకున్నారు.

News December 25, 2025

విశాఖ: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆనందపురం మండలంలో చోటుచేసుకుంది. ముచ్చర్లలోని YSR కాలనీలో చిన్నారి ఢిల్లీశ్వరి గురువారం ఆడుకుంటుండగా మూత లేని సెప్టిక్ ట్యాంక్‌లో కాలుజారి పడిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా, సెప్టిక్ ట్యాంకులో తేలాడుతూ
చిన్నారి కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.