News April 1, 2025

విశాఖలో చిన్నారులతో భిక్షాటన

image

విశాఖలో చిన్నపిల్లలతో భిక్షాటన చేయించడం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. మరికొందరు ఒడిలో నెలల పిల్లలను పెట్టుకుని మరీ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో చిన్నపిల్లలు సొమ్మసిల్లుతున్న పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా లంకెలపాలెం, అగనంపూడి, గాజువాక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Similar News

News April 2, 2025

సింహాచలం అప్పన్న రథసారథికి ఆహ్వానం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 8న జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ రథోత్సవానికి రథసారథి అయిన కదిరి లక్ష్మణరావును తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కదిరి లక్ష్మణరావు వంశానికి చెందిన వారే దశాబ్దాలుగా రథోత్సవం సారథిగా ఉండడం అనవాయితీ.

News April 2, 2025

విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

image

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 2, 2025

మధురవాడ: తల్లి, కుమార్తెపై ప్రేమోన్మాది దాడి

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కొమ్మాది సమీపంలోని స్వయంకృషి నగర్‌లో తల్లి, కూతురిపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందిగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!