News January 8, 2026

విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

image

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News February 17, 2026

విశాఖ: లక్ష్యాన్ని మించిన కస్టమ్స్ వసూళ్లు

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌కు రూ.13,207.85 కోట్ల ఆదాయం లభించింది. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం-2026 సందర్భంగా విశాఖపట్నం కస్టమ్స్ కమిషనరేట్ నిర్వహించిన ఆదాయ వసూళ్లపై అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.11,958.08 కోట్లను మించి ఇప్పటికే రూ.12,891.42 కోట్లు వసూలు చేసిందన్నారు.

News February 17, 2026

ఈనెల 21న విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.

News February 16, 2026

అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

image

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.