News March 24, 2025
విశాఖలో ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి.. కేసు నమోదు

సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి చేసిన యజమానిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆక్సిజన్ టవర్స్లో నివాసం ఉంటున్న ప్రసాద్ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయగా మర్యాదగా పిలవలేదని దాడి చేసి బట్టలు విప్పి బయటకు పంపించేశారు. వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Similar News
News March 26, 2025
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు
News March 26, 2025
విశాఖలో టమోటా రేటు ఎంతంటే?

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు బుధవారం కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/కేజీలలో) వాటి వివరాలు టమోటా రూ.16, ఉల్లి రూ. 23, బంగాళాదుంపలు రూ.16, తెల్ల వంకాయలు రూ.28, బెండ రూ.28, కాకర రూ.32, బీర రూ.38, క్యారెట్ రూ. 28/32, బీట్రూట్ రూ.24, బరబాటి రూ.25, గ్రీన్ పీస్ రూ.52, క్యాప్సికం రూ.38, పొటాల్స్ రూ. 48, బీన్స్ రూ.48, క్యాబేజీ రూ.10, కాలీఫ్లవర్ రూ.20, నిర్ణయించారు.
News March 26, 2025
విశాఖ సీపీ సూచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..!

రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు పెంచాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. ఒక్కో డ్రగ్కు ఒక్కో విధమైన ట్రీట్మెంట్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంటే అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయొచ్చని అధికారులకు సూచించారు.