News August 29, 2024
విశాఖలో మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యేలు భేటీ

విశాఖ టీడీపీ కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే పి.శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి తదితరులు లోకేశ్ను కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News January 29, 2026
GVMC స్థాయీ సంఘంలో 160 అంశాలకు ఆమోదం

విశాఖ మేయర్, స్థాయీ సంఘం ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో 159 ప్రధాన, 13 టేబుల్ అజెండాలతో మొత్తం 172 అంశాలు చర్చించారు. అవినీతికి ఆస్కారం ఉన్న 12 అంశాలను వాయిదా వేసి 160 అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖ భాగస్వామ్యం సదస్సు పనులకు ఆమోదం లభించగా, జీవీఎంసీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.
News January 29, 2026
ఏయూలో భారీ సంగీత సమ్మేళనం.. ఎప్పుడంటే?

ఆంధ్ర విశ్వవిద్యాలయం యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న భారీ సంగీత సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల కళా నైపుణ్యాన్ని చాటేలా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు వీసీ పేర్కొన్నారు.
News January 29, 2026
విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖ విమానశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విశాఖ ఉత్సవ్లో భాగంగా అరకులో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యేందుకు ముందుగానే విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికారు. బీచ్ తీరంలో ఉన్న హోటల్కు ఆయన చేరుకున్నారు.


