News March 31, 2025
విశాఖలో మహిళను నిండా ముంచిన రాంగ్ కాల్

శ్రీకాళహస్తికి చెందిన B.అక్షయ్ విశాఖకు చెందిన మహిళ(35)కు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా మెసేజ్లు చేశాడు. కొంతకాలం తర్వాత మెసేజ్లు ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసి రూ.10లక్షలు దోచేశాడు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి వేధించాడు. చివరకు మహిళ భర్త సాయంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు.
Similar News
News July 5, 2025
జమ్మికుంట: Way2News ఎఫెక్ట్.. సమయ సూచిక ఫ్లెక్సీ ఏర్పాటు

జమ్మికుంట బస్టాండ్ ప్రారంభమై 37 ఏళ్లు అయినా సమయ సూచిక బోర్డును మార్చలేదు. దీనిపై <<16829076>>గత నెల 26న<<>> Way2Newsలో “బస్టాండుకు 37 ఏళ్లు.. మారని సమయ సూచిక” అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు బస్సులు బయలుదేరే సమయ సూచిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలుపుతూ.. బస్టాండ్ ఇరుకుగా ఉందని, దీనిని విస్తరింపజేసి ఈ సమస్యనూ తీర్చాలని కోరుతున్నారు.
News July 5, 2025
ములుగు: ‘లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

జిల్లాలో వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ 1800 4257109 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజలందరూ జిల్లా అధికార వాట్సాప్, ఛానల్ను చేసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News July 5, 2025
అమలాపురం: 10వ తేదీన మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని ఆదేశించినట్లు కలెక్టర్ మహేశ్ష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు.