News March 15, 2026

విశాఖలో రేపు PGRS

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 6, 2026

GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం లేనట్టే..!

image

విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా కలరు. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.

News April 5, 2026

క్రెడిట్ చోరీ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు: మంత్రి కొండపల్లి

image

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్‌ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.

News April 5, 2026

ఏయూని సంద‌ర్శించిన స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ మ‌నుమ‌డు

image

భార‌త పూర్వ రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ మ‌నుమ‌డు, పీఎంవోకు అక‌డ‌మిక్ అడ్వైజ‌ర్‌ డాక్ట‌ర్ జి.సుబ్ర‌హ్మ‌ణ్యం శ‌ర్మ ఆదివారం ఏయూని సంద‌ర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజ‌శేఖ‌ర్‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. త‌న తాత‌గారు ఉప‌కుల‌ప‌తిగా సేవ‌లందించిన ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్న నేపథ్యంలో సంద‌ర్శించ‌డం త‌న‌కు ల‌భించిన గౌర‌వంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.