News November 15, 2025

విశాఖలో వర్చువల్‌గా రేమండ్ గ్రూప్ ప్రాజెక్ట్‌ల శంకుస్థాపన

image

విశాఖలో 2వ రోజు CII సమ్మిట్‌‌లో CM చంద్రబాబు రేమండ్ గ్రూప్ ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1201 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆ సంస్థల డైరెక్టర్ గౌతమ్ మైనీ తెలిపారు. రాప్తాడులో రూ.479.67 కోట్లతో అప్పెరెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, అనంతపురం (D) గుడిపల్లిలో ఆటో మాన్యుఫాక్చరింగ్ కాంపొనెంట్ ప్లాంట్, టెకులోదు వద్ద గ్లోబల్ ఎరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ వస్తోందన్నారు.

Similar News

News November 15, 2025

ముగిసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్

image

సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 189/9 పరుగులకు పరిమితమైంది. గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. KL రాహుల్(39), సుందర్(29) పంత్(27), జడేజా(27) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. SA బౌలర్లలో సిమోన్‌ 4, జాన్‌సెన్‌ 3 వికెట్లు, మహరాజ్, బోష్‌ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

News November 15, 2025

రెండో రోజు CII సమ్మిట్ ఫొటో గ్యాలరీ

image

AP: విశాఖలో CII సమ్మిట్ రెండోరోజు కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సదస్సు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే అధినేతలకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మిట్‌లోని పలు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువత కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు.

News November 15, 2025

GWL: షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి

image

గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’ ట్రూప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి అవగాహన కల్పిస్తూ దీనిని రూపొందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో దీనిని ఎంపిక చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి బహుమతి అందజేశారు.