News April 2, 2025
విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య

విశాఖలో 21 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని ఓ ఇనిస్టిట్యూట్లో డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతున్న పైలా దివ్య పెదగంట్యడలోని నేతాజీ నగర్లో ఉంటోంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మంగళవారం తెలిపారు.
Similar News
News December 31, 2025
2025: 657 మంది మిస్సింగ్.. 593 మంది ఆచూకీ లభ్యం: ఎస్పీ

2024 ఏడాదిలో 571 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 540 మంది ఆచూకి కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 2025 ఏడాదిలో 657 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 593 మంది ఆచూకి గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. గత ఏడాది 222 చీటింగ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 221 కేసులు నమోదయ్యాయని వివరించారు.
News December 31, 2025
షమీ విషయంలో BCCI యూ టర్న్?

చాలా కాలంగా <<18208828>>పక్కన పెట్టిన<<>> భారత బౌలర్ మహ్మద్ షమీ విషయంలో BCCI యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 ODI వరల్డ్ కప్ కోసం సెలక్టర్లు అతడిని పరిశీలిస్తున్నట్లు NDTV తెలిపింది. షమీ దేశవాళీ ప్రదర్శనను ట్రాక్ చేస్తున్నారని, పునరాగమనం దగ్గర్లోనే ఉందని BCCI వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. న్యూజిలాండ్ సిరీస్కు ఎంపిక చేయొచ్చని చెప్పింది. కేవలం అతడి ఫిట్నెస్ గురించే బోర్డు ఆలోచిస్తున్నట్లు వివరించింది.
News December 31, 2025
వరంగల్: SBI ట్రేడింగ్ పేరుతో రూ.37 లక్షల సైబర్ మోసం!

SBI ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ లెక్చరర్ను మోసం చేశారు. ఫేస్బుక్లో స్టాక్ మార్కెట్ లాభాల ప్రకటన నమ్మి లింక్ క్లిక్ చేసిన బాధితుడిని SBI Securities పేరుతో వాట్సాప్ గ్రూప్లో చేర్చి నకిలీ యాప్ ఇన్స్టాల్ చేయించారు. 20% లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి, డబ్బులు విత్డ్రా చేయాలంటే ఫీజు అంటూ మొత్తం రూ.37,11,536 దోచుకున్నారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.


