News March 23, 2025
విశాఖలో హత్య కేసు రీ ఓపెన్.. అనకాపల్లి వ్యక్తి అరెస్ట్

విశాఖలో 2021లో జి.శ్రీను అనే వ్యక్తి మర్మాంగం కోసి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యపై ఎలాంటి ఆధారాలు లేక అప్పుడు క్లోజ్ చేశారు. ప్రస్తుతం విశాఖ పోలీసులు ఈ కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను అనకాపల్లి జిల్లా రాంబిల్లి మం. జంగవాని పాలేనికి చెందిన లాలం గణేష్, పెద్ద గంట్యాడకు చెందిన తారకేశ్వరరావు చేసినట్లు గుర్తించారు. దీంతో శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
Similar News
News March 24, 2025
Stock Markets: సెన్సెక్స్ 1000+, నిఫ్టీ 300+

స్టాక్మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,658 (+307), సెన్సెక్స్ 77,984 (+1078) వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు ₹5లక్షల కోట్లమేర సంపద పోగేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, PSE, రియాల్టి, చమురు, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్ షేర్లు దుమ్మురేపాయి. కొటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. టైటాన్, ఇండస్ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, ఎయిర్టెల్ టాప్ లూజర్స్.
News March 24, 2025
ఏఐ ఫీచర్లతో యాపిల్ వాచ్ కెమెరాలు!

కెమెరాలతో కూడిన సరికొత్త వాచ్లను యాపిల్ తీసుకురానుంది. AI సాంకేతికతతో ఇవి పనిచేయనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. కెమెరాల ద్వారా పరిసరాల గురించి సమాచారం అందించడంలో ఇవి ఉపయోగపడుతాయని పేర్కొన్నాయి. స్టాండర్డ్ మోడల్స్లో ముందు వైపు, అల్ట్రా మోడల్స్లో పక్కకు కెమెరాలు ఉంటాయని పేర్కొన్నాయి. అయితే ఇవి ఫేస్ టైమ్ కాల్స్ కోసం కాకుండా AI ఫీచర్స్ ను ఉపయోగించుకునేలా ఉంటాయని వెల్లడించాయి.
News March 24, 2025
NGKL: ఎస్ఎల్బీసీ ఘటన.. సీఎం ఆదేశాలు

ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయకచర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయించి, సొరంగంలో డ్రిల్, బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ ఏడుగురికి పరిహారం చెల్లింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని, తాత్కాలిక చర్యలే కాకుండా శాశ్వత చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు.