News December 4, 2025
విశాఖలో 100 కోట్ల స్కామ్.. స్నేహ మ్యాక్స్ సీఎండీ అరెస్ట్

విశాఖలో సంచలనం సృష్టించిన స్నేహ మ్యాక్స్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు శివ భాగ్యరావును టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాదాపు రూ.100 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించి మోసం చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనే డైరెక్టర్లు, ముఖ్యమైన వ్యక్తులు అరెస్టు కాగా గురువారం శివ భాగ్యరావును అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు తెలిపారు.
Similar News
News December 6, 2025
‘మహానటి’ నుంచి ఈతరం ఏం నేర్చుకోవాలంటే?

మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంత స్టార్డమ్ వచ్చినా మూలాలను మర్చిపోకుండా సాధారణ నటిగానే మెలిగారు. ప్రత్యేక ఏర్పాట్లు, సెపరేట్ స్టాఫ్, అనవసరపు ఖర్చులతో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. జూనియర్ ఆర్టిస్టులతో కలివిడిగా ఉండేవారు. యూనిట్ సభ్యులను బాగా చూసుకునే వారు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇవాళ సావిత్రి 90వ జయంతి.
News December 6, 2025
మే 17న JEE అడ్వాన్స్డ్

JEE అడ్వాన్స్డ్-2026 తేదీని IIT రూర్కీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది. 9AM నుంచి 12PM వరకు పేపర్-1, 2.30PM నుంచి 5.30PM వరకు పేపర్-2 ఉంటాయని వెల్లడించింది. పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. JEE మెయిన్లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులు. JEE మెయిన్ సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్లో జరగనున్నాయి.
News December 6, 2025
జిల్లాలో 23,719 PMUY కనెక్షన్లు.. MP ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో 9.71 లక్షల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వబడినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్ సభలో వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను తెలియజేశారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ గణాంకాలను అందించారు. ఈ గణాంకాల ప్రకారం, ఏలూరు జిల్లాలో 23,719 ఉచిత కనెక్షన్లు మంజూరు చేయబడ్డాయని వెల్లడించారు.


