News February 27, 2025

విశాఖలో 300 ప్రత్యేక బస్సు సర్వీసులు

image

విశాఖలో శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని 300 ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతో నడిపామని జిల్లా ప్రజారవాణాధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నడిపామని వెల్లడించారు. నగర నలుమూలల నుంచి వివిధ బీచ్‌లు, శైవక్షేత్రాలకు ఈ బస్సులు ఏర్పాటు చేశారు. జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. 

Similar News

News February 28, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల సేవలపై ప్రశంసలు 
➤ ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు 
➤ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలలో 87.30 శాతం పోలింగ్ 
➤ KGHలో శిశువులు మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ 
➤ అప్పికొండ బీచ్‌లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు అస్వస్థత 
➤ కంచరపాలెంలో తల్లి మందలించిందని 9వ తరగతి విద్యార్థి మృతి

News February 27, 2025

హ్యాట్సాఫ్.. విశాఖ పోలీస్..!

image

మహా శివరాత్రి సందర్భంగా గురువారం విశాఖలో భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశాఖ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆరుగురిని గజ ఈతగాళ్ల సాయంతో రక్షించారు. జనసంద్రంలో తప్పిపోయిన 10 మంది చిన్నారులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

News February 27, 2025

పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే: వాసుపల్లి 

image

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. పోసాని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్, లోకేశ్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయన్నారు. పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే అని ఆరోపించారు.

error: Content is protected !!